వెన్నెల్లో మంచం మీద పడుకొని చెప్పటం మొదలెట్టాడు.
రోజు పేపర్ లలో ఒకటే గోల, ఏదో దెయ్యం ఒకటి రాత్రిపూట వస్తుందని, జాగ్రత్తగా వుండాలని.
ఆ దెయ్యానికి ఒంటి నిండా కళ్ళు అని, మనుషులని చంపుతుందని ఒకటే వార్తలు.
దెయ్యాన్ని కొంతమంది చూసారని, చంపబోతే తప్పించుకున్నామని కొందరు చెప్పినట్లు పేపర్ లో వార్తలు.
మొత్తoమ్మీద విరుగుడిని సూచించారు. "ఓ స్త్రీ రేపురా " అని ఇంటి గోడ మీద వ్రాస్తే, దెయ్యం అది చదివి తర్వాతి రోజు రావటానికి వెళ్లి పోతుంది అని. అలాగే చేసారు, కొద్దిరోజుల పాటు దెయ్యం గురించిన వార్తలు లేవు. దెయ్యం కు చిరాకు వచ్చి వెళ్లిపోయింది అని చెప్పుకున్నారు.
చెప్పిందంతా విని ఓ ఏడు ఏళ్ళ పిల్లకాయ అడిగాడు. "మరి దెయ్యానికి చదువు రాకపోతే?", "వచ్చినా తెలుగు రాకపోతే?"
ఆ ప్రశ్నలకు, ఆలోచనా సరళి కి నాకు దిమ్మ తిరిగింది. ఎంత తేడా ఇప్పటి తరానికి , నా తరానికి.
ఈ ప్రశ్న ఇన్ని రోజులు నాకు రానందుకు చాలా సిగ్గేసింది అంటే నమ్మండి.
ఏమంటారు?